Home / 18+ / వైసీపీకి ఓటేసినందుకు చంద్రబాబు సొంత మండలంలో గ్రామ బహిష్కరణ

వైసీపీకి ఓటేసినందుకు చంద్రబాబు సొంత మండలంలో గ్రామ బహిష్కరణ

ఏపీలో ఎన్నికలు ముగిసినా టీడీపీ నాయకుల అరాచకాలకు అడ్డుఅదుపూ లేకుండాపోయింది. ఎన్నికల సమయంలో వైసీపీకి అనుకూలంగా వ్యవహరించిన వారిని టార్గెట్‌ చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. గ్రామ బహిష్కరణ చేయడమే కాకుండా, మహిళలపై దాడులకు కూడా తెగబడుతున్నారు. చంద్రబాబు సొంత మండలం చంద్రగిరిలోని కోట గ్రామంలో ఓ కుటుంబాన్ని టీడీపీ నాయకులు గ్రామం నుంచి బహిష్కరించారు. దాంతోపాటు మహిళపై దౌర్జన్యానికి కూడా పాల్పడ్డారు. చంద్రగిరి కోట గ్రామంలో శశిధర్‌, భార్య కరుణ నివాసముంటున్నారు గ్రామంలో శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా గ్రామోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కరుణతో పాటు మరో మహిళ స్వామి వారికి హారతి ఇవ్వడానికి వెళ్లారు. అయితే అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు మునిచంద్ర, గిరి, వెంకట్రాయులు, రాజేంద్రతో పాటు మరికొందరు టీడీపీ నాయకులు కరుణ హారతిని పక్కకు నెట్టేశారు.

మీరు వైసీపీకి ఓటు వేశారు అందుకే మిమ్మల్ని గ్రామం నుంచి బహిష్కరించామంటూ బెదిరింపులకు దిగారు. దీనిని ఆమె ఆక్షేపించి, నిలదీయడంతో కరుణతో పాటు మరికొందరు మహిళలను టీడీపీ నాయకులు నీచమైన భాషలో దుర్భాషలాడారు. దౌర్జన్యానికి పాల్పడ్డారు. గ్రామంలో జరిగే కార్యక్రమాలకు వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించారని.. దీంతో బాధితులు వాపోయి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న వైసీపీ నేతలు పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని, బాధితులకు అండగా నిలిచారు. పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేసిందేమీ లేదని అందుకే మాకు నచ్చిన పార్టీకి మద్దతివ్వడం తప్పా అని బాధిత మహిళలు ప్రశ్నించారు. కోట గ్రామంలోని టీడీపీ నాయకులు వ్యవహరించిన తీరు దారుణమని నిరసించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat