మీకు ఆధార్ కార్డుందా.. ?. అయితే మీ ఖాతాలో రెండు లక్షల రూపాయలు పడ్డట్లే.. ఆగండి ఆగండి అప్పుడే రెండు లక్షలు మావే అని సంకలు గుద్దుకోకండి. అసలు విషయం ఏమిటంటే వేదాంత లిమిటేడ్ అధినేత అనిల్ అగర్వాల్ ఇటీవల కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలో బీజేపీ సర్కారుకు కొన్ని కీలక సూచనలు సలహాలు ఇచ్చారు.
ఈ క్రమంలో ఆయన “ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాగి ఉన్న వనరులన్నిటినీ బయటకు తీయాలని” మోదీ సర్కారుకు సూచించారు. అంతే ప్రభుత్వ రంగ సంస్థలకు,ప్రభుత్వ రంగ బ్యాంకులకు స్వయంప్రతిపత్తి ఇవ్వాలని చెప్పారు. అంతే కాకుండా దేశంలో ఆధార్ కార్డు ఉన్న ప్రతీ ఒక్కరికీ ప్రధానమంత్రి ముద్రా యోజన కింద రూ. రెండు లక్షల చొప్పున రుణం ఇవ్వాలని కూడా సూచించారు.
ఇలా చేయడం వలన ప్రభుత్వ రంగ సంస్థలు,బ్యాంకులు ప్రస్తుతం ఉన్న దానికంటే మూడు రెట్లు ఎక్కువగా పనిచేయగలవని ఆయన అన్నారు. రెండు లక్షలను ఇవ్వడం ద్వారా పేదరికాన్ని తగిగించవచ్చు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలను ఇవ్వచ్చు అని ఒక ప్రముఖ వార్త సంస్థకిచ్చిన ఇంటర్వూ ఆయన పేర్కోన్నారు..