మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరక్కెక్కుతున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. ఈ చిత్రానికి తనయుడు రాంచరణ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రొమోషన్ల పనిలో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా నాలుగు భాషల్లో విడుదల కానుంది. దీనికి సంభందించి ఈ వారంలో సినిమా ట్రైలర్ ను రిలీజ్ చెయ్యాలని చిత్ర యూనిట్ భావిస్తుంది. ఇందులో మరో విశేషం ఏమిటంటే ఈ ట్రైలర్ లో సినిమా స్టొరీ మొత్తం చూపనున్నారని తెలుస్తుంది. ఇటీవలే చిత్ర టీజర్ విడుదల కాగా..ఇందులో ముఖ్య పాత్రల ఎంట్రీ చూపించడం జరిగింది. ఇక ట్రైలర్ కు సంబంధించి అంతా రెడీగా ఉందని యూనిట్ తెలిపింది.