తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి అశోక్ గజపతిరాజును పరామర్శించారు. అశోక్ గజపతి రాజు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవల చికిత్స పొందిన ఆయన ప్రస్తుతం ఇంటివద్దే ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇటీవల హైదరాబాద్లోని అశోక్ గజపతి ఇంటికి వెళ్లిన చంద్రబాబు ఆయనను పరామర్శించారు. ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉంది.. ఏం ఆహారం తీసుకుంటున్నారు.. అంటూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. మీరు త్వరగా కోలుకోవాలంటూ చంద్రబాబు ఆకాంక్షించారు.