మీరు రైల్వేలో ప్రయాణిస్తారా.?. మీ దినసరి జీవితం రైలు ప్రయాణంతోనే మొదలవుతుందా..?. అయితే ఇది మీకు సంబంధించిన వార్త. రైల్వే ప్రయాణికులకు ఐఆర్సీటీసీ బోర్డు దిమ్మతిరిగే షాకిచ్చింది.
పర్యాటక,క్యాటరింగ్ రైల్వే బోర్డు డైరెక్టర్ విడుదల చేసిన సర్క్యులర్ ప్రకారం ప్రముఖ ట్రైన్లు అయిన శాతాబ్ధి,రాజధాని ,దురంతో ఎక్స్ ప్రెస్ లలోని టీ,టీఫెన్ ,భోజనం ధరలను పెంచేసింది.పెరిగిన ధరల ప్రకారంవీటిలో ఒక కప్పు టీ ధర రూ .10 నుండి రూ .15 కు పెంచారు.
అదే స్లీపర్ క్లాస్, సెకండ్ క్లాస్ ఏసీ బోగీల్లో అయితే టీ ధర రూ .20. ఇక భోజనం విషయానికొస్తే, దురంతో ఎక్స్ప్రెస్ స్లీపర్ క్లాస్లో లంచ్/ డిన్నర్కు రూ. 120 రూపాయిలు చెల్లించాల్సిందే. మునుపటి ధర. రూ.80. ఈ రైళ్లలో సాయంత్రం వేళలో ఫస్ట్ క్లాస్ ఏసీ, ఎగ్జిక్యూటివ్ క్లాస్లో టీ ధర రూ.35 (రూ .6 పెంపు) అల్పాహారం రూ. 140, (రూ .7 పెంపు) లంచ్ డిన్నర్ రూ .245 (రూ .15 పెరిగింది)