తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని చేనేత రంగాన్ని ఆదుకోవడం కోసం రాష్ట్రంలో ఉన్న ప్రజాప్రతినిధులందరూ వారంలో ఒకరోజు అదే సోమవారం చేనేత వస్త్రాలను ధరించాలని మంత్రి కేటీ రామారావు పిలుపునిచ్చారు.
అయితే మరోవైపు తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని గడ్డి అన్నారం మార్కెట్ లో అధికారులు,సిబ్బంది ,మార్కెట్ కమిటీ పాలకవర్గం వారంలో సోమవారం రోజు చేనేత వస్త్రాలను ధరించాలని మార్కెట్ కమిటీ తీర్మానం చేసింది.
ఈ తీర్మానం వచ్చే సోమవారం నుండి మొదలవుతుంది. రాష్ట్రంలో ఉన్న అన్నీ మార్కెట్ యార్డులన్నీ ఇలా చేస్తే బాగుంటదని కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు.