పార్లమెంట్ ఆవరణలో టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన చేస్తున్నారు. మహాత్మాగాంధీ విగ్రహం దగ్గర ప్లకార్డులతో టీఆర్ఎస్ ఎంపీలు నిరసనకు దిగారు. రాష్ర్టానికి రావాల్సిన నిధులు, జీఎస్టీ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఉభయసభల్లో టీఆర్ఎస్ ఎంపీలు వాయిదా తీర్మానం ఇచ్చారు.
వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన నిధులు, ఆర్థిక సంఘం బకాయిలు, గ్రామీణాభివృద్ధి నిధులు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ఆర్థికమాంద్యం ప్రభావం దేశంపై లేదని చెప్తున్న కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రానికి రావాల్సిన నిధులను సరిగ్గా ఇవ్వడంలేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో పన్నుల్లో రాష్ట్ర వాటా ఇప్పటి వరకు గతేడాది కంటే 2.13% తక్కువ ఇచ్చింది.
వాస్తవంగా గత ఏడాదికంటే అదనంగా 6.2% రావాల్సి ఉండగా మైనస్లోకి వెళ్లింది. దీంతో రావాల్సిన 8.3%కంటే.. తక్కువ వాటా నిధులు తెలంగాణకు వచ్చాయి. ఈ విషయంపై తీవ్రంగా స్పందించిన సీఎం కేసీఆర్.. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్కు ఈ నెల 7న లేఖ రాశారు.