కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ..సెంట్రల్ ట్రేడ్ యూనియన్లు పిలుపునిచ్చిన బంద్ లో పాల్గొనున్నట్లు అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల అసోసియేషన్ ప్ర్తకటించింది.
దీంతో జనవరి ఎనిమిదో తారీఖున బ్యాంకులు,ఏటీఎంల సేవలకు అంతరాయం కలుగుతుంది. ఆన్ లైన్ బ్యాంకింగ్ సేవలు మాత్రం యథావిధిగా పని చేస్తాయని బ్యాంకు అధికారులు తెలిపారు. బ్యాంకుల విలీనానికి వ్యతిరేకంగా కూడా నిరసనలు తెలియజేస్తామని వారు తెలిపారు.