ఏపీలో మూడు రాజధానుల అంశంపై ఈ రోజు ఆధికారక ప్రకటన రానున్న సంగతి విదితమే. దీంతో మాజీ ముఖ్యమంత్రి,ప్ర్తధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తమ ఆందోళలను ఉధృతం చేయడంతో రాష్ట్రంలోని రాజధాని ప్రాంతంలో హైటెన్షన్ చోటు చేసుకుంది.
ఈ క్రమంలో అమరావతిలో సుమారు ఐదు వేల మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాట్లను చేశారు. అలాగే ఉద్రిక్తలు నెలకొనే అవకాశమున్న ప్రతి చోట బస్సులను తగ్గించారు.
ముఖ్యంగా గుంటూరుకు వెళ్ళే రూట్లల్లో ఆర్టీసీ బస్సులను అధికారులు నిలిపేశారు. దాదాపు యాబై బస్సుల దాక డిపోలోనే ఉన్నాయి. మంత్రులు,ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత వీటిని పునరుద్ధరించే అవకాశముంది.