తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ దర్శకుడు.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ అల వైకుంఠపురములో . ఈ చిత్రం విడుదలైన దగ్గర నుండి పలు సంచలనాలకు కేంద్ర బిందువు అవుతుంది. అంతేకాకుండా బాక్స్ ఆఫీసు దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.
అయితే ఈ చిత్రం ఆనందంలో ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ కు లీగల్ నోటీసులు వచ్చే అవకాశమున్నట్లు సమాచారం. అల వైకుంఠపురములో సినిమా కథ కృష్ణ అనే దర్శకుడి దగ్గర నుంచి కాఫీ కొట్టాడు అని ఫిల్మ్ నగర్లో వార్తలు గుప్పుమంటున్నాయి.
ఇదే కథను 2013లో ఫిల్మ్ ఛాంబర్లో దర్శకుడు కృష్ణ రిజిస్టర్ చేయించుకుని ఆ ప్రతిని త్రివిక్రమ్ శ్రీనివాస్ కిచ్చాడు అని టాక్. దశ దిశ అనే టైటిల్ తో మూవీ తీసే ప్రయత్నంలో ఉండగానే త్రివిక్రమ్ శ్రీనివాస్ అల వైకుంఠపురములో మూవీ తీశాడని ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.