టీమ్ఇండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీకి ఇంకా వయసు అయిపోలేదని, ఇంకొంత కాలం అద్భుతంగా క్రికెట్ ఆడగలడని భారత సీనియన్ బ్యాట్స్మన్ సురేశ్ రైనా అన్నాడు.
‘‘ధోనీ గొప్పగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అతడికి ఇంకా ఎంతో క్రికెట్ మిగిలుంది. మేం ప్రాక్టీస్ గేమ్స్లో భారీ సిక్సర్లు బాదాం. వేడి ఎక్కువగా ఉండే చెన్నైలో సాయంత్రం మూడు గంటల పాటు బ్యాటింగ్ చేశాం. ఇంకా వయసు అయిపోలేదని అతడి శరీరం చెబుతోంది.
మైదానంలో మీరు కొత్త ధోనీని చూస్తారు’’ అని రైనా తెలిపాడు. చెన్నై సూపర్ కింగ్స్కు ధోనీ, రైనా ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.14-15 ఏళ్లగా క్రికెట్ ఆడుతున్నానని, తన ఆటలో పొరపాట్లు ఉంటే సారథిగా ధోనీ, దాదా తెలిపేవారని అన్నాడు.