Home / SLIDER / గుత్తా జ్వాలకు వేధింపులు

గుత్తా జ్వాలకు వేధింపులు

భారత మహిళల బ్యాడ్మింటన్‌లో డబుల్స్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాలది ఫైర్‌బ్రాండ్‌ మనస్తత్వం. ముక్కుసూటిగా మాట్లాడుతూ, తనకు నచ్చని విషయాన్ని బాహాటంగానే వెల్లడిస్తుంది. అయితే తాను చేసే విమర్శలు కెరీర్‌లో వెనకబడేలా చేశాయని, ముఖ్యంగా జాతీయ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ కారణంగా చాలా అవకాశాలు కోల్పోయానని జాతీయ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో జ్వాల ఆరోపించింది.

2004లో గోపీ, జ్వాల కలిసి మిక్స్‌డ్‌ డబుల్స్‌లో జాతీయ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ గెలుచుకున్నారు.

కానీ ఆ తర్వాత ఇరువురి మధ్య దూరం పెరిగింది. ‘నా కెరీర్‌లో ఎదుర్కొన్న వేధింపులకు గోపీచందే కారణంగా చెబుతాను. నేనేదైనా బహిరంగంగానే మాట్లాడతా. దీనికి తగిన మూల్యం కూడా చెల్లించా. బ్యాడ్మింటన్‌లో నా సత్తా ఏమిటో ఆయనకు తెలుసు. అందుకే నాకు మద్దతుగా ఉంటాడని భావించా. కానీ మిక్స్‌డ్‌లో నాతో కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన వారితో ఆడేవాడు.

ఒకప్పుడు టాప్‌ ఆటగాళ్లు మన రాష్ట్రం నుంచి వచ్చేవారు కాదు. కానీ గత దశాబ్దకాలంగా అంతా హైదరాబాద్‌లోని అతడి అకాడమీ నుంచి మాత్రమే వస్తున్నారు. అలా అయితేనే వారికి గుర్తింపు లభిస్తుంది. భారత్‌కు పతకం వస్తే అది గోపీచంద్‌ శిక్షణ వల్లే వచ్చినట్టు, రాకపోతే మాత్రం తప్పు వ్యవస్థ మీదికి నెట్టేస్తున్నారు’ అని జ్వాల ఆరోపించింది

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat