ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడుకు ఆ పార్టీకి చెందిన తెలుగు తమ్ముళ్ళు ఒకరి తర్వాత ఒకరు ఝలక్ ల మీద ఝలక్ లు ఇస్తూ పార్టీకి గుడ్ బై చెప్తున్నారు .ఇటీవల జరిగిన మంత్రి వర్గ విస్తరణలో కానీ నిన్న కాక మొన్న జరిగిన పార్టీ పదవుల పంపకంలో జరిగిన తీవ్ర అన్యాయానికి విస్మయాన్ని వ్యక్తం చేస్తూ తమ అసంతృప్తిని వ్యక్తపరుస్తున్నారు .దీనిలో భాగంగా కొంతమంది అయితే ఇటు అధికార అటు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు .మరికొంతమంది అయితే ఏకంగా వచ్చే ఎన్నికల నాటికి పార్టీ మారాలని నిర్ణయం తీసుకుంటున్నారు .
ఈ కోవలోకే చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు ,టీడీపీ పార్టీకి చెందిన అత్యంత సీనియర్ నాయకుడు మాజీ మంత్రి శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే అయిన బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి వస్తున్నారు .వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోపు టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పడమే కాకుండా ప్రత్యేక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు అని బొజ్జల అనుచరవర్గం అంటున్నారు .ఇటీవల జరిగిన మంత్రి వర్గ విస్తరణలో కానీ పార్టీ పదవుల పంపకంలో కానీ పార్టీలోనే అత్యంత సీనియర్ నాయకులు అయిన బొజ్జల ను బాబు తీవ్రంగా అవమానించడంతో ఆయన ఈ నిర్ణయానికి వచ్చారు .
టీడీపీ పార్టీ అధికారంలో ఉన్న ప్రతిసారి ఏనాడూ కూడా మంత్రిగా లేకుండా ఉన్నారు .అలాంటిది ప్రస్తుతం బాబు హాయంలో మంత్రిగా ఉన్న ఆయన్ని తప్పించడమే కాకుండా పార్టీ పదవి ఇవ్వకపోవడం నొచ్చుకున్నారు బొజ్జల మరియు బొజ్జల అనుచవర్గం .అయితే తానూ రాజకీయాలకు దూరంగా ఉన్న కానీ తన తనయుడు అయిన బొజ్జల సుధీర్ రెడ్డిని రంగంలోకి దించనున్నారు అని కూడా టాక్ .అయితే వచ్చే ఎన్నికల్లో ఇరవై మంది దాక ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వని తేల్చి చెప్పిన చంద్రబాబు ఆ జాబితాలో బొజ్జల కూడా ఉన్నారు అని సమాచారం .అయితే తనకు కాకపోయిన కానీ తన తనయుడికి అయిన ఇవ్వాలని బొజ్జల అడిగారు అంట .కానీ బాబు ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వకపోవడంతో అవసరమైతే వైసీపీలో చేరి తన సత్తా ఏమిటో ..తన సీనియారిటీ పవర్ ఏమిటో చూపించాలని ఉవ్విరిల్లుతున్నారు అని జిల్లా రాజకీయాల్లో చర్చలు జరుగుతున్నాయి .చూడాలి మరి అత్యంత సీనియర్ పోలిటిసియన్ అయిన బొజ్జల ఏ నిర్ణయం తీసుకుంటారో ..?