ఆయన ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ పార్టీకి ముచ్చెమటలు పట్టించిన మహానేత ..పాదయాత్రతో బాబు సర్కారు నిరంకుశ పాలనకు చరమగీతం పాడిన నేత ..అధికారమే అందని ద్రాక్షగా మిగిలిన కాంగ్రెస్ పార్టీకి చానా యేండ్ల తర్వాత అధికారం కారణమైన ప్రజానేత ..ఆయనే అప్పటి ఉమ్మడి ఏపీ రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి .
ఆయనకు నవ్యాంధ్ర రాష్ట్రంలో తీవ్ర అవమానం జరిగింది .రాష్ట్రంలో ఇటివల తూర్పు గోదావరి జిల్లాలో కాకినాడ మున్సిపల్ ఎన్నికలు జరిగిన సంగతి తెల్సిందే .ఎంతో ఉత్కంఠంగా జరిగిన ఈ ఎన్నికల్లో అధికార టీడీపీ పార్టీ డబ్బుల ప్రవాహాన్ని కురిపించి మేయర్ పీఠం దక్కించుకుంది .అయిన కానీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీ పది సీట్లను గెలుచుకుంది .అయితే ఎన్నికల నోటిపికేషన్ విడుదలైన తర్వాత జిల్లాలో ముఖ్యంగా కాకినాడ పట్టణంలో పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతల విగ్రహాలకు ముసుగులు వేశారు .
అయితే ఎన్నికల కోడ్ ముగిసిన కానీ ఒక చోట మాత్రం మహా నేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి వేసిన ముసుగు మాత్రం ఇప్పటివరకు తొలగించలేదు .వివరాల్లోకి వస్తే జిల్లాలోని భీమడోలు మండలం గుండుగోలను గ్రామంలో ఎన్నికల కోడ్ నేపథ్యంలో మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి ముసుగు వేశారు .ఎన్నికల కోడ్ ముగిసి ఇన్నేండ్లు అయిన కానీ ఇంకా దాన్ని తొలగించలేదు .దీంతో స్థానిక వైసీపీ నేతలు ,వైఎస్సార్ అభిమానులు దీనిపై అడిగితే స్థానిక అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతల ప్రోద్భలంతో అధికారులు కుంటి షాకులు చెప్తున్నారు .చూడాలి మరి ఈ గ్రామంలో ఎప్పుడు ఎన్నికల కోడ్ ముగుస్తుందో ..?