Home / ANDHRAPRADESH / టీడీపీకి ఓటేయకపోతే దళితులు జైలుకు వెళ్లాల్పి ఉంటుంది….మంత్రి జవహర్ బెదిరింపు వ్యాఖ్యలు…!

టీడీపీకి ఓటేయకపోతే దళితులు జైలుకు వెళ్లాల్పి ఉంటుంది….మంత్రి జవహర్ బెదిరింపు వ్యాఖ్యలు…!

ఏపీలో తమ ఆత్మగౌరవాన్ని, సామాజికంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లో అణిచివేస్తున్న చంద్రబాబు పట్ల దళితుల్లో పూర్తి వ్యతిరేకత నెలకొంది. దీంతో దళితులు ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌ వెన్నంటే నిలబడుతున్నారు. గరగపర్రులో అగ్రవర్ణాలతో జరిగిన ఘర్షణలో దళితులు సాంఘిక బహిష్కరణకు గురైన దరిమిలా రెండు నెలల పాటు తీవ్ర ఉద్రికత్తలు ఏర్పడిన సమయంలో చంద్రబాబు ప్రభుత్వం అగ్రవర్ణాలకు కొమ్మకాస్తు సమస్యను జటిలం చేసింది. అయితే ప్రతిపక్షనాయకుడిగా వైఎస్ జగన్ గరగపర్రు వెళ్లి సామరస్యంగా ఇరువర్గాలతో చర్చించి వారి మధ్య సఖ్యత నెలకొల్పాడు..దీంతో దళితులు వైఎస్ జగన్‌ని తమ ఆత్మగౌరవప్రతీకగా భావిస్తున్నారు..అంతే కాదు వైఎస్ హయాంలో తమకు జరిగిన మంచిన దళితులు గుర్తు చేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్‌కే మద్దతు పలుకుతారని వార్తలు వస్తున్న నేపథ్యంలో దళిత సామాజిక వర్గానికే చెందిన మంత్రి టీడీపీకి ఓటేయకపోతే దళితులు జైలుకు వెళ్లాల్సి ఉంటుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో మంత్రి జవహర్ వ్యాఖ్యలపై వివరాల్లోకి వెళితే ఏపీ మంత్రి జవహర్‌ దివంగత నేత వైఎస్‌, ఆయన కుమారుడు జగన్‌తో పాటు సొంత సామాజిక వర్గం దళితులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న మంత్రులు పుల్లారావు, నక్కా ఆనందబాబులతో కల్సి మాజీ ఉప ప్రధాని బాబూజగ్జీవన్‌ రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి జవహర్ వైఎస్‌ దళితులకు పదవులు ఇవ్వకుండా తమను దోచుకున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇడుపులపాయలో ఇప్పటికీ దళితుల భూముల్లో వైఎస్ కుటుంబ సభ్యులు సాగు చేసుకుంటున్నారంటూ ఆరోపించారు..అంతే కాదు వచ్చే ఎన్నికల్లో దళితులు టీడీపీకి ఓటేయకుండా జగన్ వెన్నంటే నడిస్తే ఆయనతోపాటు జైలుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు..మంత్రి జవహర్
బెదిరింపు వ్యాఖ్యలపై దళితుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతుంది. టీడీపీకి ఓటేయకపోతే జైలుకు పోవాల్సివస్తుందని బెదిరించడం సరికాదని దళితులు మండిపడుతున్నారు. మొత్తానికి వచ్చే
ఎన్నికలకు ముందు నంద్యాల తరహాలో గ్రామాల్లో దళితుల రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు లాక్కుని టీడీపీకి ఓటేకయపోతే మీకు వచ్చే లబ్ది ఆగిపోతుందని బెదిరించే అవకాశం ఉందని, టీడీపీకి మద్దతు ఇవ్వని దళితులపై అక్రమ కేసులు బనాయించి జైలుకి పంపించే అవకాశం ఉందని మంత్రి జహవర్ బెదిరిస్తున్నాడు..ప్రజాస్వామికవాదులు మంత్రి జవహర్‌ని నిలదీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat