Home / SLIDER / విప్లవాత్మకంగా నూతన పంచాయతీరాజ్ చట్టం..!

విప్లవాత్మకంగా నూతన పంచాయతీరాజ్ చట్టం..!

పోరాడి సాధించిన తెలంగాణ రాష్ట్రంలో గ్రామస్వరాజ్యాన్ని సాకారం చేసే దిశగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలోని తండాలు, గూడేలు, చెంచు పల్లెలను పంచాయతీలుగా మార్చాలని నిర్ణయించింది. కొత్తగా మరిన్ని పంచాయతీలను ఏర్పాటు చేయాలని తీర్మానించింది. కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటుచేసే క్రమంలో ప్రధాన గ్రామానికున్న దూరాన్ని, శివారు పల్లెల జనాభాను, భౌగోళిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోనున్నారు. కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలు ఏర్పాటుచేసినప్పుడు వ్యవహరించినట్లుగానే కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటుచేసేటప్పుడు కూడా ఉదారంగానే ఉండాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ మేరకు కొత్తగా పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకురావాలని తీర్మానించింది. కొత్తగా తెచ్చే ఈ చట్టం విప్లవాత్మకంగా ఉంటుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అభిప్రాయపడ్డారు. గ్రామ పంచాయతీ చట్టం తెచ్చిన తర్వాత ప్రజలకు బాగా సేవలందించే విధంగా మున్సిపాలిటీలను మార్చడానికి కొత్త మున్సిపల్ చట్టం కూడా తేవాలని సీఎం ప్రతిపాదించారు. కొత్త పంచాయతీరాజ్ చట్టం ద్వారా గ్రామాల్లో అద్భుతమైన, గుణాత్మకమైన మార్పు రావాలని సీఎం ఆకాక్షించారు. సోమవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ముఖ్యమంత్రి అధ్యక్షతన ప్రారంభమైన రాష్ట్ర క్యాబినెట్ సమావేశం సుదీర్ఘంగా దాదాపు ఎనిమిది గంటలపాటు సాగింది. ఇందులో ప్రధానంగా పంచాయతీలు, గ్రామ స్వరాజ్యంపై లోతైన చర్చ జరిగింది. ముఖ్యమంత్రి దీనిపై సుదీర్ఘ కసరత్తు చేశారు. మంత్రులు, అధికారుల అభిప్రాయాలను వివరంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీలు సమర్ధవంతంగా విధులు నిర్వర్తించే విధంగా చట్టాన్ని రూపొందించాలని సూచించారు.

రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా నిర్ణీత గడువులోగా ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. తండాలను పంచాయతీలు చేయాలనే దానిపై చర్చించారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రక్రియను పూర్తి చేయాలని సీఎం సూచించారు. దీనితోపాటు సర్పంచ్‌లకు మరికొన్ని బాధ్యతలు అప్పగించాలని, విధుల్లో నిర్లక్ష్యం చేసినవారిపైన, నిధుల దుర్వినియోగానికి పాల్పడిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. పరిపాలనారంగంలో విశేష అనుభవం గడించిన అధికారులు, న్యాయ కోవిదులతో సంప్రదించి కొత్త చట్టానికి రూపకల్పన చేసే అధికారాన్ని మంత్రివర్గం ముఖ్యమంత్రికి అప్పగించింది. గిరిజన తండాలను, కోయగూడేలను, గోండు గూడేలను , చెంచు పల్లెలను గ్రామ పంచాయతీలుగా మార్చాలని, ప్రధాన గ్రామానికి దూరంగా ఉన్న పల్లెలను, శివారు గూడేలను కూడా ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా మార్చాలని మంత్రివర్గం నిర్ణయించింది. కొత్త చట్టంతో గ్రామపంచాయతీలకు నిధులతోపాటు వారు నిర్వహించే విధుల విషయంలో కూడా సృష్టత వస్తుందని సీఎం ప్రతిపాదించారు. విధులను సక్రమంగా నిర్వర్తించని పంచాయితీలపై చర్యలు తీసుకునే అధికారం కూడా ప్రభుత్వానికి ఉండేలా చట్టంలో నిబంధనలు పొందుపరిచి, అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని అన్నారు. దీనికి మంత్రివర్గ సభ్యులు ఆమోదించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat