Home / MOVIES / జై ల‌వ‌ కుశ గురించి ఆ సీక్రెట్ తెలిసి పోయింది!

జై ల‌వ‌ కుశ గురించి ఆ సీక్రెట్ తెలిసి పోయింది!

జై ల‌వ కుశ విడుద‌ల‌కు ముందు ఈ సినిమాకు సంబంధించిన ఓ విష‌యాన్ని స‌స్పెన్స్‌లో పెట్టేశాడు జూ.ఎన్టీఆర్. ఈ సినిమా చేయాలా..? వ‌ద్దా..? అన్న డైల‌మాలో ఉన్న‌ప్పుడు త‌న‌కు అత్యంత స‌న్నిహితులైన ఇద్ద‌రు ద‌ర్శ‌కుల‌ను స‌ల‌హా అడిగాన‌నీ, వాళ్లిద్ద‌రూ ఓకే అన్నాకే. ఈ సినిమా చేశాన‌ని చెప్పుకొచ్చాడు తార‌క్‌. అయితే, ఆ ఇద్ద‌రు ద‌ర్శ‌కులు ఎవ‌ర‌న్న‌ది వెల్ల‌డించ‌లేదు. సినిమా రిలీజ్ అయ్యాక చెబుతాన‌న్నాడు. అప్ప‌టి నుంచి ఎన్టీఆర్ అభిమానులు ఆ ఇద్ద‌రు ద‌ర్శ‌కులు ఎవ‌రా..? అన్న గెస్సింగ్‌లో ప‌డిపోయారు. ఎస్ఎస్ రాజ‌మౌళి, వీ.వీ.వినాయ‌క్‌, కొర‌టాల శివ‌ల చుట్టూ వాళ్ల ఆలోచ‌న‌లు తిరిగాయి. అయితే, జ‌య ల‌వ కుశ విడుద‌లై నెల రోజులు అవుతున్నా.. ఇంకా ఎన్టీఆర్ ఆ ఇద్ద‌రు ద‌ర్శ‌కుల పేర్లు వెల్ల‌డించ‌లేదు.
అయితే, ఈ విష‌యంపై ఎన్టీఆర్ చెప్ప‌క‌ముందే.. జై ల‌వ కుశ ర‌చ‌యిత కోన వెంక‌ట్ నోరు విప్పేశారు. ట్వీట్ట‌ర్‌లో ఓ అభిమాని అడిగిన ప్ర‌శ్న‌కు జ‌వాబుగా ఈ సంగ‌తి చెప్పాడు కోన వెంక‌ట్‌. ఆ ఇద్ద‌రు ద‌ర్శ‌కులు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి, కొర‌టాల శివ అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో అభిమానుల అంచ‌నాలు క‌రెక్టేన‌ని తేలిపోయింది.
ఎన్టీఆర్‌కు వీళ్లిద్ద‌రూ అత్యంత స‌న్నిహితులు. తార‌క్‌తో స్టూడెంట్ నెం.1, సింహాద్రి, య‌మ‌దొంగ వంటి హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చిన రాజ‌మౌళి త‌న‌ను ఎప్పుడూ గైడ్ చేస్తూనే ఉంటాడు. కొర‌టాల కొంచెం లేటుగా తార‌క్‌కు ఫ్రెండ్ అయ్యాడు. అత‌ను కూడా ఆత్మీయుడే. వీళ్లిద్దరి కాంబినేష‌న్‌లో జ‌న‌తా గ్యారేజ్ లాంటి సూప‌ర్ హిట్ వ‌చ్చిన సంగతి తెలిసిందే.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat