గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామ్ పోతినేని లేటెస్ట్ మూవీ ఉన్నది ఒకటే జిందగీకి అన్ని చోట్ల నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. రివ్యూ, రేటింగ్లు కూడా చాలా వరకు కూడా ప్రోత్సాహకరంగానే వచ్చాయి. క్రిటిక్ కూడా ఈ చిత్రంపై ఏ మాత్రం పెదవి విరచలేదు.
ఓవరాల్గా ఈ చిత్రానికి మంచి రిపోర్ట్ వచ్చింది.
దీంతో ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్లో బాక్సీఫీస్ వద్ద దుమ్ము దులిపేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా రూ.11 కోట్ల షేర్ రాబట్టింది. మూడు రోజుల్లోనే పెట్టిన పెట్టుబడిలో రూ.50 శాతం రికవరీ చేయడంతో ఈ సినిమా హిట్ కేటగిరీలోకి చేరుతుందని అంతా అనుకున్నారు. కానీ, తీరా వీక్డేస్ రిజల్ట్ చూస్తే ఆ అంచనాలు బోల్తా కొట్టేశాయి.సోమవారం రోజు ఈ చిత్రం చెప్పుకోదగ్గ వసూళ్లు రాబట్టలేకపోయింది. అన్ని ఏరియాల్లోనూ భారీగా డ్రాప్ అయింది. మంగళ, బుధవారాల్లో మరింత తక్కువ కలెక్షన్లు నమోదు అయ్యాయి. కేవలం లక్షల్లోనే వసూళ్లు నమోదైనట్టు ట్రేడ్ లెక్కల్లో తేలింది. దీంతో.. ఈ చిత్రం ప్లాప్గానే తేలేలా ఉంది.
అంతేగాక నిన్న మూడు చిత్రాలు మంచి అంచనాల మధ్యనే విడుదల అయ్యాయి. నాలుగో రోజుకే డీలాపడ్డ రామ్ జిందగీపై ఈ మూడు చిత్రాల ప్రభావం కచ్చితంగా ఉంటుంది. కాబట్టి వసూళ్లు ఇంకా.. దారుణంగా తగ్గిపోతాయి. మొత్తంగా చూసుకుంటే బాక్సాఫీసు వద్ద జిందగీ సినిమా పని అయిపోయినట్లే. టోటల్గా బయ్యర్స్కి 25శాతం నష్టం వాటిల్లిక తప్పదంటున్నారు విశ్లేషకులు.
నేను శైలజ తరువాత రామ్, తిరుమల కిశోర్ చేసిన సినిమా కాబట్టి ఆ మ్యాజిక్ మళ్లీ రిపీటై ఈ చిత్రం బయ్యర్లకు భారీ లాభాలు తెచ్చిపెడుతుందని ట్రేడ్ వర్గాలు సైతం భావించాయి. కానీ రెండో వారానికి చేరుకునేలోపే ఇలా చాప చుట్టేసి పెద్ద షాక్ ఇచ్చింది. పాపం రామ్ హిట్ ట్రాక్ను కంటిప్యూ చేద్దామని ఎంత డిఫరెంట్గా ప్రయత్నిస్తున్నా అతనికి దెబ్బమీద దెబ్బ పడుతూనే ఉంది.
డైరెక్టర్ తిరుమల కిషోర్ రామ్ హీరోగా ఉన్నది ఒకటే జిందగీ సినిమాను డైరెక్ట్ చేయడంతో పాటు రామ్ సరసన అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా నటించారు.