నటరుద్రుడు ఎన్టీఆర్ జై లవ కుశ చిత్రం తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయబోయే చిత్రం ఇటీవలే ప్రారంభమైన విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్ ముఖ్య అతిధిగా హాజరై క్లాప్ కొట్టారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఆ లోపు తమ పాత్రకి తగ్గట్టుగా ప్రత్యేకంగా సన్నద్ధమవుతారు. అయితే, ఆ సినిమా పట్టాలెక్కడానికి ఇంకా రెండు నెలలకు పైగా సమయముంది. దీంతో ఎన్టీఆర్ తదుపరి చిత్రాల కోసం మరిన్ని కథల్ని వింటున్నారని తెలిసింది.
అయితే, ఎన్టీఆర్ కోసం ప్రముఖ నిర్మాణ సంస్థ ఓ కుటుంబ కథని సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అన్నీ కుదిరితే ఈ సినిమా పక్కా అయ్యే అవకాశాలు ఉన్నాని ఫిల్మ్ వర్గాల సమాచారం. అయితే, ఈ కథ పక్కా అయినప్పటికీ.. మొదట త్రివిక్రమ్ సినిమానే సెట్స్పైకి వెళ్లనుంది. త్రివిక్రమ్ సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్. టబు కూడా ఓ కీలక పాత్రదారి.