యంగ్ టైగర్ ఎన్టీఆర్ రీసెంట్ మూవీ జై లవ కుశ తారక్ కెరీర్లో రెండో బిగ్గెస్ట్ హిట్గా నిలవడంతో తన నెక్స్ట్ మూవీపై ఫోకస్ పెట్టాడు తారక్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ సినిమా ఇటీవల లాంచ్ అయింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేతులమీదుగా ఈ చిత్రాన్ని లాంచ్ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ సినిమాకు సంబంధించిన కథను ముందుగా దర్శకుడు త్రివిక్రమ్ పవన్ కల్యాణ్కు వినిపించాడన్న వార్తలు అప్పట్లో గుప్పుమన్న విషయం తెలిసిందే.
అంతేకాదు, ఈ సినిమాకు సంబంధించిన కథకు ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్ అయితేనే బాగుంటుందని పవన్ కల్యాన్ ఎన్టీఆర్కు చెప్పడంతో.. త్రివిక్రమ్ – ఎన్టీఆర్ కాంబినేషన్ సెట్ అయినట్లు సమాచారం. అందులో భాగంగానే ఈ మధ్యనే జరిగిన ఎన్టీఆర్ చిత్రం ప్రారంభ పూజా కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కల్యాన్ ముఖ్య అతిధిగా హాజరై ఎన్టీఆర్కు క్లాప్ కూడా కొట్టారు. అయితే, అప్పుడు పవన్ కల్యాణ్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు మాకు శాపంగా మారిందని అంటున్నారు ఎన్టీఆర్ అభిమానులు.
అసలు విషయానికొస్తే…
ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుపుకోవడానికి ఇంకా మూడు నెలల సమయం ఉండటంతో ఇప్పుడది తారక్ ఫ్యాన్స్ పాలిట శాపంగా మారింది. ఈ గ్యాప్లో తారక్ వేరే డైరెక్టర్స్తో వేరే సినిమా చేస్తాడన్న వార్త ఇండస్ర్టీలో నిన్న.. మొన్నటి వరకు వినపడింది. కానీ. తాజాగా తారక్ తన ఫ్యూచర్ ప్లాన్ ప్రకటించాడు. త్రివిక్రమ్తో సినిమా చేసే వరకు తారక్ ఎలాంటి కమిట్మెంట్ ఇవ్వకూడదని డిసైడయ్యాడట.
దీంతో ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని తారక్ నిర్ణయించుకున్నాడు. దీంతో తారక్ నుంచి సినిమాను ఎక్స్పెక్ట్ చేసిన అభిమానులకు నిరాశే మిగిలింది. ఇలా తారక్ తన నిర్ణయం తెలపడంతో తారక్ ఫ్యాన్స్ కొంత వరకు నిరాశకు లోనైనా త్రివిక్రమ్ వంటి స్టార్ డైరెక్టర్ సినిమా కోసం తారక్ ఆ మాత్రం టైమిస్తే పర్వాలేదని అంటున్నారు. ఏదేమైనా ఇప్పుడు ఈ వార్త టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది.