ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు గత ఏడాది ఇదే రోజున తీసుకున్న అతి పెద్ద సంచలన నిర్ణయం రూ వెయ్యి ,ఐదు వందల పాత నోట్ల రద్దు.ఈ నిర్ణయం తీసుకొని నేటికి సరిగ్గా అంటే బుధవారానికి ఏడాది పూర్తికానుంది. ఈ సందర్భంగా ఒక సామాన్యుడు ప్రధాని మోదీకి రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది .ఆ లేఖ సారాంశం మీకోసం
డియర్ మోడీ సార్…
నొట్ల రద్దు చేయగానే దేశం మారిపోతుందని మద్దతిచ్చిన వ్యక్తిని నేను…ఎంతమంది మిమ్ముల విమర్శించినా వెంటనే ఫలితం రాదు అని 50రోజులు ఆగండి అని వారితో వాదించిన వ్యక్తిని నేను,పేదోడి బ్రతుకు మారుతుందని కలలు గని మీకు సంపూర్ణ మద్దతు తెలిపిన సామాన్యున్ని నేను..కానీ నేటికి ఏడాది నోట్ల రద్దుతో దేశానికి ఒరిగిందేందో ఇప్పటికి ఏం అర్దం ఐతలేదు…దేశాన్ని లైన్ లో నిటబెట్టడంలో సఫలం..కానీ ఆ లైన్ లో నిలబట్డ పేదోళ్ళకు ఒక్కరూపాయి ఫయిదా లేదు .దీంతో వాళ్ళకు ఒరిగిందేంలేదన్నది వాస్తవం.
ఒక చిరుద్యోగి తన కష్ఠార్జితమైన జీతం తీసుకుని నెల నెలా అవసరాలు తీర్చుకునేందుకు రాత్రులదాకా పడిగాపులు.రూంల రెంటు కట్టక ఏటిఎంల పైసలు రాక కాలీ చేసిపోయిర్రు కొందరు ఇదే నోట్ల రద్దుతోమీరు అందించిన ఫలం..మీ సంకల్పం గొప్పదే కావచ్చు కానీ ఆచరణ అస్తవ్యస్తమై జనాల ఆగం పట్టిచ్చింది..నల్లదనం వెనక్కొచ్చిందంటున్నారు .మరి వెనక్కొచ్చిన నల్లదనం అంతా ఏమైనట్టు..? ఎటుపోయినట్టు…?.
దీనివల్ల లాభపడింది బ్యాంకులు,మేనేజర్లు,బ్యాంకులకాడ జర పతార ఉండి నోట్లు మార్పియ్యగలిగే కమీషన్ ఏజెంట్లు..మీరు ఎనక్కి తెచ్చిన నల్లదనంతో పేదోని జీవన విదానం మారలే,దరలు దిగిరాలే ,పెట్రోల్ రేటు మారలే .కొత్త నోటు పేదోని గడప తొక్కకముందే ,పెద్దోని గల్లా పెట్టెను చేరింది.పేదోడు ఎండలో లైనుల కష్టంగ పైసలు తెచ్చుకుంటే,పెద్దోడు దర్జాగా ఇంట్లో కూసోని కట్టలుతెప్పిచ్చుకుండు….మోడీసార్ నోట్ల రద్దుతో పేదోనికొరిగింది శూన్యం..పొదుపు ,జాగ్రత్త మాత్రం దేశానికి నేర్పారు…1000రూపాయల కోసం లైన్ లో రెండు రోజులు అవస్థపడ్డ ఓ ముసలవ్వ సాక్షిగా…జీతం పడ్డా ఏటిఎం ,బ్యాంకుల్లో పైసా రాక రూమునే కాలీచేసిన నా మిత్రుని సాక్షిగా..మీరు 15లక్షలు వేస్తారని ఖాతా తెరచి ఎదురుచూస్తున్న ప్రజల సాక్షిగా…నోట్ల రద్దై ఏడాది ఐన సందర్బంగా మోడీ గారికి,అరుణ్ జైట్లి గారికి ఏం చెప్పాలో తెలియక శుభాకాంక్షలు చెబుతున్నా..
ఇట్లు
నోట్ల రద్దు చేయగానే మీకు మద్దతు తెలిపిన సామాన్యుడు -Telangana Vijay