ప్రజా సంకల్పం పాదయాత్రలో భాగంగా వైసీపీ అధినేత , ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అందరినీ చిరునవ్వుతో పలకరిస్తూ.. కష్టాలు తెలుసుకుంటూ.. భరోసా ఇస్తూ.. అలుపెరుగని బాటసారిలా దూసుకుపోతున్నారు. పల్లె, పట్టణం తేడా లేకుండా…మహిళలు, వృద్ధులు సైతం నేరుగా వచ్చి ప్రతిపక్ష నేతను కలిసి తమ కష్టాలను వివరిస్తున్నారు. ఈ క్రమంలో రాయచోటి నియోజకవర్గం దువ్వూరు మండలం జిల్లెళ్ల గ్రామానికి చెందిన వరాలు, వరప్రసాద్ దంపతులు తమ ఏడాది చంటి పిల్లాడిని తీసుకొని జగన్మోహన్రెడ్డి వద్దకు వచ్చారు. తమ బిడ్డకు పేరు పెట్టాలని కోరగా, నాన్న పేరు పెడదామని అన్నారు. ఆ చిన్నారికి రాజశేఖర్ అని జగన్ నామకరణం చేశారు. దీంతో ఆ దంపతులు, కుటుంబ సభ్యులు సంబరపడిపోయారు.
