జీహెచ్ఎంసీలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించేందుకు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం నుంచి బయలుదేరిన మంత్రి కేటీ రామారావు ఈ సందర్భంగా నగరంలో సుడిగాలి పర్యటన నిర్వహించారు. సహచర మంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎమ్మెల్యేలు, మేయర్, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి ముషీరాబాద్, నారాయణగూడలోని పలు ప్రాంతాలను సందర్శించిన మంత్రి బృందం ఈ సందర్భంగా పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
బన్సీలాలపేటలోజీహెచ్ఎంసీ నిర్మించిన మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ ను మంత్రి కేటీఆర్ సారథ్యంలోని బృందం సందర్శించింది. సిటీ సెంట్రల్ లైబ్రరీ, పలు నాలాలు, మార్కెట్లను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రఖ్యాత సిటీ సెంట్రల్ లైబ్రరీకి మంత్రి కేటీఆర్ వరాల జల్లు కురిపించారు. సిటీ సెంట్రల్ లైబ్రరీ ఆధునీకరణకు రూ.5 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో పాటుగా డిజిటల్ లైబ్రరీగా సిటీ లైబ్రరీని తీర్చిదిద్దుతామని తెలిపారు.
Post Views: 281