దివ్యాంగులకు సేవ చేస్తే దేవుడికి సేవ చేసినట్టే అని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అన్నారు . ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా… రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా నుంచి ఐమాక్స్ వరకు దివ్యాంగుల అవగాహన నడక కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మహమూద్ అలీ మట్లాడుతూ … మీకు మేము ఉన్నాం.. మీరు ఒంటరి కాదు.. మనమంతా ఒక కుటుంబం.. దేవుడి దయ వల్ల మంచి సీఎం మనకు ఉన్నారు… పుట్టే బిడ్డలకు కేసీఆర్ కిట్ ఇస్తున్నాం… వికలాంగుల అభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్దే. 5 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి సీఎం కేసీఆర్ చొరవ తీసుకొని కల్పించారు. మీకు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని అన్నారు . ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు ఈటెల రాజేందర్, మహేందర్ రెడ్డి, సినీ నటులు రాజశేఖర్, జీవిత,వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ వాసుదేవారెడ్డి తదితరులు పాల్గొన్నారు.