Home / ANDHRAPRADESH / వైసీపీలోకి సీనియర్ మాజీ ఎమ్మెల్యే ..

వైసీపీలోకి సీనియర్ మాజీ ఎమ్మెల్యే ..

ఏపీలో అప్పుడే సార్వత్రిక ఎన్నికల వేడి రాజుకుంది .అందులో భాగంగా అధికార టీడీపీ పార్టీ నుండి నేతలు ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసల పర్వం మొదలైంది .అందులో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో బిగ్ షాక్ తగలనున్నది .

జిల్లాలో పీలేరు అసెంబ్లీ నియోజక వర్గ మాజీ ఎమ్మెల్యే ,టీడీపీ నేత జీవీ శ్రీనాథ్ రెడ్డి వైసీపీలో చేరనున్నారు అని టీడీపీ పార్టీ వర్గాలు ,వైసీపీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నారు .అందులో భాగంగా వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ,శ్రీకాంత్ రెడ్డిలతో జీవీ ఇటివల భేటీ అయ్యారు .ఈ సందర్భంగా జీవీ త్వరలోనే టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీలో వస్తాను అని వైసీపీ ఎమ్మెల్యేలతో చెప్పినట్లు వైసీపీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నారు .

గత నాలుగు ఏండ్లుగా టీడీపీ అధికారంలో ఉన్న కానీ ఒక్క హమీను నేరవేర్చకపోగ పలు అవినీతి అక్రమాలకు పాల్పడటంతో వచ్చే ఎన్నికల్లో ఆపార్టీ అధికారంలోకి వచ్చే వీలు లేకపోవడం ..బాబు ఇతర పార్టీల నుండి వచ్చిన వారికీ తగిన గౌరవం ఇవ్వకపోవడమే కాకుండా వైసీపీ నుండి వచ్చిన ఎమ్మెల్యేల పట్ల కూడా బాబు అదే తీరుగా వ్యవహరిస్తుండటం ఇలా పలు కారణాల వలన మిగతావారు కూడా వైసీపీ వైపు వస్తారు అని జీవీ వాళ్లతో చెప్పినట్లు సమాచారం .అయితే త్వరలో జగన్ పాదయాత్రలో భాగంగా జీవీ తన అనుచరవర్గం ,టీడీపీ శ్రేణులతో వైసీపీ తీర్ధం పుచ్చుకుంటాను అని ఆయన తెలిపారు అని జిల్లా రాజకీయాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి ..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat