టీఆర్ఎస్లోకి వలసలజోరు కొనసాగుతున్నది. మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు ఎలిమినేటి ఉమామాధవరెడ్డి, ఆమె కుమారుడు, యాదాద్రి భువనగిరి జిల్లా టీడీపీ అధ్యక్షుడు సందీప్రెడ్డి మంగళవారం బేగంపేట క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుతో వారు భేటీ అయిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీకి ఉమా మాధవరెడ్డి, ఆమె కుమారుడు సందీప్రెడ్డి ఇవాళ రాజీనామా చేశారు.
ఈమేరకు వారు తమ రాజీనామా లేఖలను పార్టీ జాతీయ అధ్యక్షుడు , ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి పంపారు. తాము ఆవేదనతోనే పార్టీని వీడాల్సి వస్తోందని, టీడీపీలో పదవులిచ్చి మమ్మల్నీ ఎంతో గౌరవించారని ఆ లేఖలో పేర్కొన్నారు.కాగా , గురువారం ఉదయం ఉదయం 11 గంటలకు ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరనున్నారు .మామాధవరెడ్డి చేరికతో భువనగిరి నియోజకవర్గంలో టీఆర్ఎస్ మరింత బలోపేతం కానుంది. ఇప్పటికే భువనగిరి ఖిల్లాపై టీఆర్ఎస్ జెండా రెపరెపలాడుతున్నది.