తెలంగాణ రాష్ట్రంలో గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచిన పదిహేను మంది ఎమ్మెల్యేలలో పన్నెండు మంది ఎమ్మెల్యేలు అధికార టీఆర్ఎస్ పార్టీలో..టీటీడీపీ పార్టీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ టీడీపీ పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెల్సిందే .
మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఒకరు ఖమ్మం జిల్లా సత్తుపల్లి అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే ఎస్ వెంకట వీరయ్య ..ఇంకొకరు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య .అయితే తాజాగా ఆయన ఏపీలో చంద్రబాబు సర్కారు కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తుండటంతో తమ పార్టీ అధినేతపై గుర్రుగా ఉన్న సంగతి తెల్సిందే .
ఇలాంటి తరుణంలో ఆర్ కృష్ణయ్యకి ఏపీ రాష్ట్ర విద్యుత్ బీసీ ఉద్యోగుల సంఘం బిగ్ షాకిచ్చింది .ప్రస్తుతం ఆర్ కృష్ణయ్య ఏపీరాష్ట్ర విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమం సంఘం గౌరవ అధ్యక్షుడిగా ఉన్న సంగతి తెల్సిందే .అయితే ఆ పదవిని కృష్ణయ్య ను తొలగిస్తున్నట్లు ఆ సంఘం ప్రతినిధులు తెలిపారు .కాపుల విషయంలో తమకు తలనొప్పిగా మారిన కృష్ణయ్య ప్రాభల్యాన్ని తగ్గించడం కోసం చంద్రబాబు ఈ ప్లాన్ చేశారని కృష్ణయ్య వర్గీయులు ఆరోపిస్తున్నారు