ఇటీవలి కాలంలో గతంలో కంటే దూకుడు పెంచి ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు బీపీ పెంచేలా కామెంట్లు చేస్తున్న మాజీ కేంద్రమంత్రి, భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా జాతీయ నాయకురాలు దగ్గుబాటి పురందీశ్వరి మరోమారు అదే తరహా వ్యాఖ్యలు చేశారు. కొద్దికాలం కిందరటి వరకు ఏపీ సర్కారు తీరును, ప్రచార ఆర్భాటాన్ని, ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు ప్రభుత్వం వైఖరిని తీవ్రంగా తప్పుపట్టిన పురందీశ్వరి తాజాగా టీడీపీ-బీజేపీ పొత్తు విషయంలో కలకలం రేపే ప్రకటన చేశారు.
కృష్ణాజిల్లా మచిలీపట్నంలో పురందీశ్వరి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ బలమైన పార్టీగా మారిందన్నారు. గతంలో ఏ ప్రభుత్వం అమలు చేయని సంక్షేమ పథకాలను ప్రధాని మోదీ అమలు చేసి అన్ని వర్గాలకు సముచిత న్యాయం చేస్తున్నారన్నారని అన్నారు. ఇటీవల జరిగిన గుజరాత్, హిమాచల్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీకి మరింత బలాన్ని చేకూర్చాయన్నారు. సాధారణ ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం ఉన్న నేపథ్యంలో టీడీపీతో పొత్తు విషయంలో ఇప్పుడే నిర్ణయం తీసుకోలేమని పురందీశ్వరి స్పష్టం చేశారు. తద్వారా తమతో ఖచ్చితంగా టీడీపీ నేతలకు గట్టి షాక్ ఇచ్చారు