బాలీవుడ్ లో ప్రస్తుతం ఓ జంటపై హాట్ హాట్ చర్చ జరుగుతోంది. వాళ్లే దీపికా పదుకొణే..రణవీర్ సింగ్…వీరిద్దరి గురించి రకరకాలుగా సోషల్ మీడియాలో కూడై కోస్తోంది. గత కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే బాలీవుడ్లో మరో భారీ వివాహ వేడుక జరగబోతోందా?. ఈ ప్రశ్నకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఈ నెల 5న(శుక్రవారం) రణ్వీర్, దీపికలకు శ్రీలంకలో నిశ్చితార్థం జరగనుందని సమచారం.
శుక్రవారం దీపిక పుట్టినరోజు కూడా. రణ్వీర్-దీపికలు గత ఐదేళ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్నారు. న్యూ ఇయర్ వేడుకలకు మాల్దీవులకు వెళ్లిన దీపిక, రణ్వీర్లు.. అక్కడి నుంచి ఇరువురి కుటుంబసభ్యులతో కలసి శ్రీలంకలకు వెళ్లనున్నట్లు తెలిసింది. నిశ్చితార్థం తర్వాత కొద్దిరోజుల్లోనే వివాహ వేడుక కూడా ఉంటుందని సమాచారం.