Home / SLIDER / దేవుడుగా మంత్రి హరీష్ రావు నాకు ప్రాణం పోశారు…

దేవుడుగా మంత్రి హరీష్ రావు నాకు ప్రాణం పోశారు…

తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఒకవైపు అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ ..మరో వైపు రానున్న ఏడాదిలోనే కోటి ఎకరాలకు సాగునీళ్ళు అందించడానికి ప్రాజెక్టుల నిర్మాణ పనుల సమీక్ష సమావేశాల్లో బిజీబిజీగా ఉంటారు .అయిన కానీ తనకు కష్టం ఉందని సోషల్ మీడియా దగ్గర నుండి ట్విట్టర్ వరకు ..టెక్స్ట్ మెసేజ్ నుండి కాల్ వరకు మాధ్యమం ఏదైనా సరే మంత్రి హరీష్ రావుకు తెలియజేస్తే వెంటనే స్పందించి దాని పరిష్కారం కొరకు అవసరమైతే స్వయంగా తానే రంగంలోకి దిగి సాయం కోరివచ్చిన వారికి అండగా నిలబడతాడు .

ఇప్పటివరకు చాలా సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం .తాజాగా రాష్ట్రంలో సిద్ధిపేట జిల్లా కేంద్రానికి చెందిన సుష్మ డిగ్రీ రెండో ఏడాది చదువుతుంది.ఆ యువతి తండ్రి రాజలింగం ఒక బీడీ కంపెనీలో కూలీ.అయితే ఎనిమిది నెలల కిందట అస్వస్థతకు గురైన తన కూతుర్ని ఆస్పత్రిలో చూపించారు.పరిక్షలనంతరం పాపకు కిడ్నీలు పాడయ్యాయి అని డాక్టర్లు తేల్చి చెప్పారు .అయితే తమ తహత్ తగ్గట్లు డయాలసిస్ చేసిన కానీ పాప ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది.దీంతో సుష్మ బ్రతకాలంటే కిడ్నీ మార్పిడి చేయాలి ..అయిన కానీ ఆమె శరీరం సహకరించే స్థాయిలో లేదని తేల్చి చెప్పారు.దీంతో ఏమి చేయాలో అర్ధం కాక మంత్రి హరీష్ రావు తమ గోడును చెప్పుకున్నారు .

అంతే మంత్రి హరీష్ రావు హైదరాబాద్ మహానగరంలో నిమ్స్ డాక్టర్లతో స్వయంగా మాట్లాడి ఆస్పత్రిలో చేర్పించి..మెరుగైన చికిత్స అందించాలి .దానికి అవసరమైన ఖర్చులను తను భరిస్తా అని వైద్యులకు తెలిపారు.అంతే కాకుండా పాప తల్లిదండ్రులు హైదరాబాద్ లో ఉండటానికి అవసరమైన తదితర ఖర్చులను కూడా చూసుకుంటాను అని మంత్రి హామీ ఇచ్చారు.దీంతో వైద్యులు సుష్మకు వైద్యం అందించడానికి ముందుకొచ్చారు.దీనిపై సుష్మా మాట్లాడుతూ మంత్రి హరీష్ రావు దేవుడుగా నాకు ప్రాణం పోశారు.ఒక వైద్యుడుగా నాలో ఉత్సాహం ధైర్యాన్ని నింపారు.మంత్రి హరీష్ రావు గారు భరోసా ఇవ్వడంతో వైద్యులు చికిత్స మొదలెట్టారు అని ఆనందంతో చెప్పుకొచ్చింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat