తెలంగాణ రాష్ట్రంలోని పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల మండలం చిన్నమడూరు గ్రామానికి చెందిన శాలివాహన(కుమ్మరి) సంఘానికి చెందిన సుమారు 45 మంది ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. అద్యక్షులు మడికొండ ఉప్పలయ్య, కార్యదర్శి మడికొండ కృష్ణ లతోపాటు సంఘం సభ్యులకు గులాబీ కండువాలు కప్పి టిఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. కార్యకర్తలను అన్ని విధాలుగా కాపాడుకుంటామని ఎమ్మెల్యే ఎర్రబెల్లి హామీ ఇచ్చారు.
దేవరుప్పుల మండలం ధర్మాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్పీటిసి వంగాల మల్లయ్య, మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పూర్ణచందర్, కాంగ్రెస్ పార్టీ బిసి సెల్ అద్యక్షుడు వీరన్న, కార్యదర్శి రాంబాబు, ఎస్సీ సెల్ కార్యదర్శి ఎల్లయ్య లతోపాటు మరికొంతమంది ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు.