Home / ANDHRAPRADESH / ఆ నాడు 11 రోజులు అన్నం తినలేదు…నేడు జై తెలంగాణ ..పవన్ కళ్యాణ్ ను నమ్మలా..వద్దా

ఆ నాడు 11 రోజులు అన్నం తినలేదు…నేడు జై తెలంగాణ ..పవన్ కళ్యాణ్ ను నమ్మలా..వద్దా

తెలంగాణ నుంచి తన రాజకీయ యాత్రను ప్రారంభించిన జనసేన అధినేత, సినీ నటుడు పవన్‌ కల్యాణ్ మంగళవారం జైతెలంగాణ అంటూ నినదించారు. రెండోరోజు కరీంనగర్‌లో అభిమానులతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ నేల తల్లికి ఆఖరిశ్వాస వరకు రుణపడి ఉంటానని అన్నారు. జైతెలంగాణ నినాదం వందేమాతరం అంతటి గొప్ప వాక్యమని అన్నారు. జై తెలంగాణ.. ఆ నినాదం నాకు అణువణువు పులకరింత ఇస్తుంది. వందేమాతరం ఎలాంటి పదమో, మంత్రమో.. జై తెలంగాణ కూడా అలాంటి గొప్ప మహావాక్యం. దేశమంతా స్వాతంత్ర్యం వచ్చినా తెలంగాణకు మాత్రం సంవత్సరం తర్వాత వచ్చింది. దేశమంతా పండుగ జరుపుకుంటే.. తెలంగాణ ఇంకా మా స్వేచ్ఛ ఎప్పుడు అనుకుంటూ గడిపింది. ఆ ఆ సమయంలో గుండెల్లో మార్మోగిన నినాదమే జై తెలంగాణ. నాకు ఆనందంగా, గర్వంగా ఉంది’ అని పవన్‌ కల్యాణ్‌ అన్నారు.
అయితే..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించినందుకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 11 రోజులు అన్నం తినలేదని స్వయంగా పవనే కాకినాడలోని సీమాంధ్రుల ఆత్మగౌరవ సభలో వెల్లడించి్న సంగతి అందరికి తెలిసిందే..అంతేగాక ఉద్యమం పేరుతో తెలంగాణ నేతలు సీమాంధ్ర ప్రజలపై తిట్ల పురాణాలతో అవమానిస్తుంటే సీమాంధ్ర రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు స్పందించిన తీరు చూసి తాను ఎంతగానో బాధకు లోనయ్యేవాడినని తెలిపారు. సీమాంధ్ర నేతలకు కొంచెమైనా పౌరుషం, మానాభిమానాలు లేవా అని తనకు అనిపించేదని చేప్పిన ఆయన ఈరోజు ఇలా మాట్లడుతున్నాడు. ఇటు తెలంగాణ వాళ్లు….ఆటు ఆంధ్రప్రదేశ్ వాళ్లు పవన్ కల్యాణ్ ను నమ్మలా ..వద్దా అని చేస్తున్నకామెంట్లు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat