జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన ‘చలోరె చలోరె చల్’ యాత్రలో భాగంగా మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఇవాళ అయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో పర్యటించారు.పర్యటనలో భాగంగా జనసేన కార్యాలయానికి అయన భూమి పూజ చేశారు.
ఈ సందర్బంగా అక్కడ తన అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ..రాజకీయాల్లో తనకు శత్రువులు ఎవ్వరు లేరని స్పష్టం చేశారు.రాష్ట్రంలో కరువు సమస్యలపై అధ్యాయం చేసి..పరిష్కారాల కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్,ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ను కలుస్తానన్నారు.తాను ఎవరికీ తొత్తులా వ్యవహరించడంలేదని అన్నారు.అంశాలను బట్టి మద్దతు ఇస్తా. రాయలసీమ అభివృద్ధి కోసం పాటుపడతానన్నారు.ఎన్ని కష్టాలు ఎదురైనా రాజకీయాల్లోనే ఉంటా..సినిమాల్లోకి వెళ్లనని ఈ సందర్బంగా స్పష్టంచేశారు.ఆంధ్రప్రదేశ్ ప్రజల సమస్యల కోసం డిల్లీ కి వెళ్లి ప్రధాని మోడీతో మాట్లాడుతానన్నారు .