పాతతరం నాయకులు కొంతమంది కష్టపడి కాపాడుకుంటున్న కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యాలతో గబ్బు పట్టిస్తున్నాడని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పొచారం శ్రీనివాస రెడ్డి విమర్శించారు. రేవంత్ రెడ్డి చిల్లర వ్యాఖ్యాలతో 70 ఏళ్ళ కాంగ్రెస్కు నాశనమేనని ఆయన అన్నారు. మెట్పల్లి శాసనసభ్యుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి పొచారం మాట్లాడుతూ
రేవంత్ రెడ్డి కాంగ్రస్ పాలిట ఐరన్ లెగ్ అని అన్నారు.
రాష్ట్రంలో రైతులను అప్పుల ఊబి నుండి బయటకు తీసుకు రావడానికి అనేక చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయ శాఖ మంత్రి పొచారం శ్రీనివాస రెడ్డి తెలిపారు. రాష్ట్రం అందిస్తున్న సహకారంతో ఉన్నత విద్యావంతులు కూడా వ్యవసాయ రంగం వైపు వస్తున్నారని వివరించారు. కాంగ్రెస్ 70 ఏళ్ళలో ఇవ్వలేని 24 గంటల కరంటును టీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగేళ్లలో ఆచరణలో చూపిందని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని, పథకాలను చూసి అధ్యయనం చేయడానికి దేశ, విదేశాల నుండి ప్రతినిధులు వస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ను ఒక మోడల్ స్టేట్ గా మార్చారని అన్నారు. 18 దేశాల ప్రతినిధులు రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు, అభివృద్ధిని వచ్చి చూసి ఆశ్చర్యపోయారని మంత్రి పోచారం వివరించారు.
తెలంగాణ రాష్ట్రం సంక్షేమ రంగంలో దేశంలోనే అగ్రగామి అని మంత్రి పోచారం వెల్లడించారు. రాష్ట్రంలో కేసీఆర్ వంటి పరిపాలన ధక్షకుడు ఇంకా ఎవరు లేరని తెలిపారు. గత 70 ఏళ్ళలో రైతులు పడ్డ కష్టాలను దూరం చేయడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుంటే కొంతమంది చిల్లర వేషాలు వేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ నాయకులు హుందాగా ఉండాలి తప్ప చిల్లరగా మాట్లాడి పరువు తీసుకోవద్దన్నారు. భాషా, పద్దతి ముఖ్యమని అన్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో కాంగ్రెస్ కు ఉన్న నాలుగు ఓట్ల కూడా రావని పోచారం జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కూడా ఆయన వెంట రావడం లేదని అన్నారు. `నీ నియోజకవర్గంలో నీ పని ఖాళీ, అందుకే రాజీనామా చేయడానికి భయపడుతున్నావు.`అని ఎద్దేవా చేశారు. `చక్కర ఫ్యాక్టరీలు మూతపడటానికి కాంగ్రెసు, టీడీపీ లే కారణం, మీరు సరియైన మద్దతు ధర చెల్లించని కారణంగా రైతులు ఇతర పంటలకు మారారు. గ్రామాలకు వెళితే ప్రజలు తరిమికాడతారని మీకు భయం పట్టుకుంది.
అసూయ, ఈర్శతో విమర్శలు చేస్తున్నారు. ఇలాగైతే మీకు డిపాజిట్ లు కూడా రావు` అని వ్యాఖ్యానించారు.