ఏపీలో గత నాలుగు సంవత్సరాలుగా టీడీపీ ప్రభుత్వం చేస్తున్నా..అన్యాయాలు,దోపిడిలు, భూకభ్జాలు, రేప్ లు,హత్యలు, దాడులు ఇలా చెప్పుకుంటూ పోతే అత్యంత దారుణంగా చేసిన పాలన కనబడుతుంది. వీటన్నింటికి ఫుల్ స్టాప్ పెట్టెలా ఒక సరియైన నీజాయితి గల నాయకుడు ఏపీ ప్రజల్లో రాజకీయం అంటే నమ్మకం కుదిరేలా నిరంతరం ప్రజల కోసం తపన పడుతున్న ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్ గత ఎడాది నవంబర్ 6 నుండి కడప జిల్లా ఇడుపులపాయి నుండి ప్రజా సమస్యల స్వయంగా తెలుసుకోవడం కోసం వాటిని భరోస ఇవ్వడం కోసం చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర చేస్తున్నాడు.
ప్రజల ఆశలు చిగురించే దారి. తోడుందనే ధైర్యం నిండిన ఊపిరి. ఆ అడుగులు భవితను రాసే సంతకాలనే నమ్మకం. ఇది ప్రజా సంకల్పం అంటూ విజయవంతంగా ముందుకు నడుస్తున్నాడు. వేలాదిగా తరలివస్తున్న ప్రజా సమూహంలో కదలలేని దివ్యాంగులు, కొడిగట్టిన దీపాల్లా వృద్ధులు మైళ్లకు మైళ్లు నడిచి వచ్చి, గంటల కొద్దీ ఎదురు చూపులు చూస్తున్నారు. ఎందుకు…?? ఓ భరోసా కోసం. నేనున్నాను భయపడకండి అని తలపై నిమిరి, గుండెలకు హత్తుకుని, నుదుటిని ముద్దాడి మరీ పోస్తున్న జీవం కోసం. ఫించన్లకోసమో, సమస్యలు చెప్పుకోవడం కోసమో మాత్రమే రావడం లేదా అవ్వా తాతలు.
see also..తల్లి చనిపోతూ.. కొడుక్కి ఉత్తరం.. కోడలు గురించి ఎం రాసిందో తెలుసా?
ఒక్కసారి తమ ప్రియతమ నేత బిడ్డను చూసి పోదామనే ఆత్రంతో వస్తున్నారు. ఆప్యాయంగా గడపగడపనూ పలకరిస్తున్న ఆ ఇంటింటి పెద్ద కొడుకును ప్రేమగా పలకరించి, ఆశీర్వదించి పోవాలని ఎదురు చూస్తున్నారు. చెడు దృష్టులు, దుర్మార్గుల కుట్రలను చీల్చుకుని చైతన్యమై నిలబడిన ఆ యువనవ సారధికి అక్కచెల్లెళ్లు హారతి పట్టేందుకు కళ్లలో వత్తులేసుకుని చూస్తున్నారు. ప్రజా సంకల్పంలో అడుగడుగునా ఓ ఉద్వేగ వాతావరణం. జన నేతను చూస్తే చాలనే ప్రజల ఆరాటం…మేడలు, మిద్దెలు, దారులు, చెట్లు అన్నీ ప్రజా సమూహాలతో నిండి పోతున్నాయి. జన నేత వైఎస్ జగన్ కు ఘన స్వాగతం పలుకుతున్నారు.
see laso..మద్యం మత్తులో పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన ఇద్దరు యువతులు