తెలంగాణ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉండగానే అప్పుడే ఎన్నికల సమరం మొదలైంది.అందులో భాగంగా తెలంగాణ బీజేపీ పార్టీ అధినాయకత్వం అప్పుడే ఇటు అసెంబ్లీ ఎన్నికలకు ,అటు పార్లమెంటు ఎన్నికలకు సన్నద్ధమవుతున్నట్లు కనిపిస్తుంది.ఈ క్రమంలో రానున్న ఎన్నికల్లో మొత్తం నూట పంతొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో బరిలోకి దిగాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆలోచిస్తుంది.
అంతే కాకుండా పదిహేడు లోక్ సభ స్థానాల్లో ఐదు స్థానాల్లో పోటి చేయాలనీ ఆ పార్టీ జాతీయ అధిష్టానం ఆలోచిస్తుంది.ఈ క్రమంలో కరీంనగర్ పార్లమెంటు నియోజక వర్గం నుండి బరిలోకి దిగే అభ్యర్థిని ఖరారు చేసినట్లు ఆ పార్టీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నారు.
2019 ఎన్నికల్లో కరీంనగర్ నుండి బీజేపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావును పోటి చేయించాలని ఇటు రాష్ట్ర అటు జాతీయ అధిష్టానం భావిస్తోందని ఆ పార్టీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నారు.అయితే ఇప్పటికే కరీంనగర్ లేదా సికింద్రాబాద్ రెండు స్థానాల్లో ఏదోక స్థానంలో బరిలోకి దించాలని ఇప్పటికే జాతీయ అధిష్టానం ఆలోచిస్తున్న నేపథ్యంలో చూడాలి మరి కరీంనగర్ నుండి బరిలోకి దిగుతారా ..సికింద్రాబాద్ నుండి బరిలోకి దిగుతారా అని ..?