Home / ANDHRAPRADESH / చిరుని మోసం చేసిన వాళ్లలో పవన్ కళ్యాణ్‌దే ఫస్ట్ ప్లేస్..!!

చిరుని మోసం చేసిన వాళ్లలో పవన్ కళ్యాణ్‌దే ఫస్ట్ ప్లేస్..!!

చిరంజీవి, ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ర్టీలోకి ఎంట్రీ ఇచ్చి త‌న‌దైన శైలి న‌ట‌న‌తో అంద‌రిని మెప్పించి అఖిలాంధ్ర ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందిన వ్య‌క్తి. అంతేకాకుండా, త‌న సోద‌రులకు సైతం సినీ ఇండస్ర్టీలో ఎదుగుద‌ల‌కు తోడ్ప‌డ్డ వ్య‌క్తి. అటువంటి వ్య‌క్తిని త‌న స్వ‌యాన సోద‌రుడే మోసం చేశాడు.

గ‌త సంవ‌త్స‌రం ముగింపులో ప‌వ‌న్ క‌ల్యాన్ ఉత్త‌రాంధ్ర ప‌ర్య‌ట‌న చేసిన విష‌యం తెలిసిందే. ప‌ర్యట‌న‌లో భాగంగా త‌న అన్న, మెగాస్టార్ చిరంజీవి 2008 జ‌న‌వ‌రి 26న ఇరుప‌తిలో స్థాపించిన ప్ర‌జారాజ్యం పార్టీ గుర్తుల‌ను నెమ‌ర వేసుకున్నారు. అప్ప‌టి వ‌ర‌కు సినీ న‌టుడుగా ఉన్న చిరంజీవి వెంట చాలా మంది న‌డిచారు. ఆ త‌రువాత ఒక్కొక్క‌రుగా ప్ర‌జారాజ్యం పార్టీ నుంచి జారిపోవాల్సిన ప‌రిస్థితి. ఆ విష‌యాల‌ను ప‌వ‌న్ త‌న ఉత్త‌రాంధ్ర ప‌ర్య‌ట‌న‌లో ప్ర‌స్థావించిన విష‌యం తెలిసిందే. అయితే, చాలా మంది నేత‌లు చిరంజీవిని న‌ట్టేట ముంచార‌ని ప‌వ‌న్ త‌న ప‌ర్య‌ట‌న ప్ర‌సంగంలో ప‌ర్య‌టించారు. చిరంజీవికి ద్రోహం చేసిన వారిలో ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్‌కు మొద‌టి స్థానంలో ఉన్నాడ‌ని చెప్పాడు కూడాను.

ఇదిలా ఉండ‌గా.. చిరంజీవిని మోసం చేసిన వారిలో ప‌వ‌న్ క‌ల్యాణ్‌ది మొద‌టి ప్లేస్ అంటూ సోష‌ల్ మీడియాలో ఓ వార్త సంచ‌ల‌నం హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్ చిరంజీవిని మోసం చేశాడు స‌రే.. మ‌రి నీవేమి చేసిన‌ట్లు అంటూ ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు నెటిజ‌న్లు. ప్ర‌జారాజ్యం పార్టీని ఎలాగైనా న‌డ‌పాల్సింది పోయి.. నిస్సిగ్గుగా పార్టీ జెండాను ప‌క్క‌న పెట్టేశాడు ప‌వ‌న్ క‌ల్ఆల్యాణ్‌, అంత‌టితో ఆగ‌క ఏకంగా చిరంజీవిని వ‌దిలివెళ్లాడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌. మ‌రి చిరంజీవి ఆ ఎన్నిక‌ల్లో ముఖ్య‌మంత్రిగా గెలిచి ఉంటే ప‌వ‌న్ క‌ల్యాణ్ ఉండేవాడేమో మ‌రి. సొంత త‌మ్ముడే ప్ర‌జారాజ్యం పార్టీని, అన్న చిరంజీవిని వదిలేశాడు… మ‌న‌మెంత.. అనుకున్నారో ఏమో ఇత‌ర నేత‌లు కూడా ప్ర‌జారాజ్యం పార్టీ నుంచి జారుకున్నారు. ఈ అంశాల‌న్నింటిని ప‌రిశీలిస్తే చిరంజీవికి మొద‌టి ద్రోహం చేసింది ప‌వ‌న్ క‌ల్యాణే క‌దా..!! అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat