ఇటివల అండర్ 19 ప్రపంచ కప్ ను టీం ఇండియా గెలుపొందిన సంగతి తెల్సిందే .దీంతో బీసీసీఐ జట్టులోని ఆటగాళ్ళతో పాటుగా ఇతర సిబ్బందికి కూడా భారీ నజరానాను ప్రకటించింది.బీసీసీఐ ప్రకటించిన ఈ నజరానాపై అండర్ 19 కోచ్ రాహుల్ ద్రావిడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.వరల్డ్ కప్ ను గెలిచిన యువభారత్ జట్టులోని ఆటగాళ్ళకు ఒక్కొక్కరికి ముప్పై లక్షలు .
కోచ్ కు యాబై లక్షలు ,ఇతర సిబ్బందికి ఒక్కొక్కరికి ఇరవై లక్షల రూపాయల నజరానాను బీసీసీఐ ప్రకటించింది.దీనిపై ద్రావిడ్ మాట్లాడుతూ తనకు యాబై లక్షల రూ.లు ,సహాయ సిబ్బందికి ఒక్కొక్కరికి ఇరవై లక్షలు ప్రకటించడంపై ద్రావిడ్ అసహనం వ్యక్తం చేశాడు.జట్టులో అందరు కల్సి సమిష్టిగా కష్టపడితేనే ప్రపంచ కప్ ను గెలుచుకున్నం.
అంతేకాని నేనేమి వారి కంటే ఎక్కువగా కష్టపడలేదు.నాకంటే వారు ఏమి తక్కువ కష్టపడలేదు.మన జట్టు ప్రపంచ కప్ గెలిచినప్పటి నుండి ఈ విషయం చెబుతున్నాను .అలాంటప్పుడు అందరికి సమానంగా ఇవ్వాలి కానీ ఈ నజరానాలో వ్యత్యాసం ఎందుకు అని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశాడు ..