తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జాగు రామన్నకు భారీ ప్రమాదం నుండి బయటపడ్డారు.ఈ రోజు సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా భారీ కేక్ కట్ చేసిన అనంతరం ఓ భూమిపూజ కార్యక్రమానికి హాజరైన ఆయన అనూహ్యంగా చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.వివరాల్లోకి వెళ్తే..మంచిర్యాలజిల్లాలో మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహ శంకు స్థాపనకు మంత్రి జోగు రామన్న, విప్ ఓదేలు, ఎమ్మెల్యే దివాకర్రావు కేసీఆర్ జన్మదిన వేడుకలకు హాజరయ్యారు.ఈ సందర్భంగా కేసీఆర్ జన్మదిన కేక్ను కట్ చేశారు. అక్కడ టపాసులు కాల్చడం మొదలుపెట్టారు. ఈ సమయంలోనే టపాసుల కారణంగా మంటలు చెలరేగాయి. అవికాస్త టెంట్కు, ఇతర ఫర్నీచర్కు అంటుకోవడంతో అగ్నికి అవి ఆహుతి అయ్యాయి. తృటిలో మంత్రి జోగురామన్నతోపాటు ఇతరులు ప్రమాదం నుంచి బయటపడ్డారు.
