తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఇవాళ వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు.ఈ క్రమంలో మంత్రి ఉదయం 11.30 గంటలకు వరంగల్ నగరనికిచేరుకొని..హాసన్ పర్తి మండలం అనంత సాగర్ లోని ఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలకు చేరుకొని ఐటీ ఇంక్యుబే షాన్ సెంటర్ ను ప్రారంబించి విద్యార్థులతో బేటీ కానున్నారు.మధ్యాహ్నం 12.15గంటలకు ఎస్ఆర్ కళాశాల నుండి బయలుదేరి హన్మకొండ బాలసముద్రంలోని పచ్చిమ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి 12.30గంటలకు చేరుకుంటారు.క్యాంప్ కార్యాలయ౦ ప్రారంభ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్న అనంతరం గీసుగొండ మండలం శాయంపేటకు 2.15గంటలకు చేరుకొని టెక్స్ట్ టైల్ పార్క్ నిర్మాణ పనులను పరిశీలిస్తారు.2.45గంటలకు శాయంపేట నుండి బయలుదేరి 3.30గంటలకు పరకాల చేరుకోనున్న మంత్రి కేటీఆర్..పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు.అనంతరం జరిగే బహిరంగ సభలో కేటీఆర్ పాల్గొంటారు.తిరిగి సాయంత్రం 5గంటలకు పరకాల నుండి నేరుగా హైదరాబాద్ బయలుదేరి వెళ్తారు.
see also : దేశ రాజకీయాలు మారాలంటే సీఎం కేసీఆర్ లాంటి వ్యక్తులకే సాధ్యం