Home / POLITICS / ఆ హక్కు రాష్ట్రాలకే ఉండాలి..ఎంపీ కవిత

ఆ హక్కు రాష్ట్రాలకే ఉండాలి..ఎంపీ కవిత

పార్లమెంట్ చివరి విడుత బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఇవాళ డిల్లీలో సమావేశం అనంతరం టీఆర్ఎస్ ఎంపీలు మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ.. విద్యా, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లపై హక్కు రాష్ట్రాలకు ఉండాలన్నదే టిఆర్‌ఎస్ ప్రధాన డిమాండ్ అని ఆమె తెలిపారు.50 శాతం రిజర్వేషన్లు ఉండాలని రాజ్యాంగంలో ఎక్కడా పొందుపర్చలేదన్నారు. ఎక్కువ రిజర్వేషన్లు కొనసాగుతున్న రాష్ట్రాల్లాగే తెలంగాణలో ఉండాలని ఆమె పేర్కొన్నారు.

see also :రంగంలోకి దిగిన సోనియాగాంధీ..! అందుకేనా..?

అనంతరం ఎంపీ జితేందర్ రెడ్డి మాట్లాడుతూ..పార్లమెంటులో గత మూడు రోజులుగా రిజర్వేషన్ల అంశంపై పోరాడుతున్నామని చెప్పారు.దేశంలో అన్ని రాష్ట్రాలకు ఒకే నీతి ఉండాలన్నారు. తాము చెప్పినట్టే రాష్ట్రాలు నడుచుకోవాలన్న విధంగా కేంద్రం ప్రభుత్వం ప్రవర్తిస్తోందని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రంలో జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఉండాలని పోరాడుతున్నామని అయన తెలిపారు .రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు అమలవుతున్నాయని ఎంపీ కేశవరావు తెలిపారు. రిజర్వేషన్ల అంశాన్ని రాష్ట్రాలకు అప్పజెప్పాలని అయన డిమాండ్ చేశారు.

see also :జగన్ వేసిన ప్లాన్ కు బాబుకు చుక్కలే ..!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat