వైసీపీ పార్టీలోకి మరల వలసల జోరందుకుంది.ఇప్పటికే గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన కర్నూలు జిల్లాకు వైసీపీ ఎమ్మెల్యేలు ,ఎంపీలు అధికార టీడీపీ పార్టీలో చేరిన సంగతి తెల్సిందే.తాజాగా ఇదే జిల్లాకు చెందిన టీడీపీ ,కాంగ్రెస్ పార్టీకు చెందిన నేతలు వైసీపీ గూటికి చేరారు.
కర్నూలు జిల్లాకు చెందిన నంద్యాల అసెంబ్లీ నియోజక వర్గానికి చెందిన టీడీపీ కాంగ్రెస్ పార్టీలకు చెందిన మాజీ మార్కెటు యార్డు చైర్మన్ ద్వారం వీరారెడ్డి,ఎన్ఎండీ జహీర్ భాషా ,రైతు నగర సర్పంచ్ కొండారెడ్డి తదితరులు కర్నూలు జిల్లా వైసీపీ అద్భ్యక్షుడు గౌర్ వెంకటరెడ్డి,మాలిక్ రాజ్ గోపాల్ రెడ్డి అధ్వర్యంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన ఎంపీలు ,ఎమ్మెల్యేలు బాబు పంచె డబ్బుల కోసం,ప్రాజెక్టుల కోసం పార్టీ మారారు తప్పా ..వైసీపీ క్యాడర్ అలాగే ఉంది.నంద్యాల ఉపఎన్నికల్లో వైసీపీ సత్తా ఏమిటో చూపించారు.కానీ బాబు కుమ్మరించిన నోట్ల కట్ల ముందు వైసీపీ ఓడిపోయింది.కానీ వచ్చే ఎన్నికల్లో కర్నూలు గడ్డ వైసీపీ అడ్డా అని మరొకసారి నిరూపిస్తాం అని వారు తెలిపారు ..