Home / ANDHRAPRADESH / ఏపీలో జాతీయ మీడియా లేటెస్ట్ సర్వే.. పక్క సమచారం ఇదే..!

ఏపీలో జాతీయ మీడియా లేటెస్ట్ సర్వే.. పక్క సమచారం ఇదే..!

ఏపీ రాష్ట్ర రాజకీయాలను గత కొద్ది రోజులుగా స్పెషల్ స్టేటస్ అనే అంశం ఒక ఊపు ఊపుతున్న సంగతి తెల్సిందే.కేవలం ఈ ఒకే ఒక్క కారణంతో ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో గత నాలుగు ఏళ్ళుగా ఏపీ ప్రజలను మోసం చేస్తున్నారు. అధికారంలోకి రాక ముందు ఒకమాట…అధికారంలోకి వచ్చాక ఒకమాట చెప్పి అత్యతం దారుణమైన పాలన సాగించారు. అయితే వీరి ఆనందం ఇక మరెన్నో రోజులు లేదు. వీరి పాలన దెబ్బ తీయడం కోసం ప్రజలు వేచి చూస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై .. వచ్చే ఎన్నికల్లో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి అని ప్రముఖ నేషనల్ మీడియా ఛానల్ ఒకసర్వే చేపట్టిందని..ఆ సర్వేలో ప్రస్తుత అధికార టీడీపీ పార్టీకి గతంలో వచ్చిన సీట్ల కంటే చాలా తక్కువ సీట్లు వస్తాయి అని ..అదే ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి మాత్రం ఎవరు ఊహించని విధంగా గతంలో కంటే ఎక్కువగా స్థానాలను గెలుచుకొని అధికారాన్ని చేపడతుందని ఆ సర్వేలో తేలింది.

ఈ సర్వేలో వచ్చిన ఫలితాల ఆధారంగా ప్రస్తుత అధికార పార్టీ గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన ఆరు వందల ఎన్నికల హామీలలో ఒక్కటి నేరవేర్చకపోగా ..విభజన చట్టంలో ఉన్న ప్రత్యేక హోదా ,రైల్వే జోన్ ,కడపకు ఉక్కు పరిశ్రమ లాంటి హామీలను తుంగలో తోక్కడమే కాకుండా అధికారాన్ని అడ్డుపెట్టుకొని గత నాలుగు ఏళ్ళుగా చేస్తున్న దాదాపు రెండున్నర లక్షల కోట్ల అవినీతి అక్రమాల పట్ల ప్రజల్లో నెలకొన్న తీవ్ర వ్యతిరేకత వలన టీడీపీకి గతంలో వచ్చిన స్థానాల్లో 100కిపైగా కోల్పోయి కేవలం20 స్థానాలను మాత్రమే గెలుచుకుంటుందని ఈ సర్వేలో తేలింది.ఇక గత సార్వత్రిక ఎన్నికల్లో కేవలం ఐదు లక్షల (రెండు శాతం)ఓట్ల తేడాతోనే అధికారాన్ని కోల్పోయి ప్రధాన ప్రతిపక్ష పాత్ర నిర్వహిస్తున్న వైసీపీ పార్టీకి వంద సీట్లు రావడంతో అధికారాన్ని చేపడుతుందని తేలింది.

గత నాలుగు ఏండ్లుగా టీడీపీ సర్కారు అవినీతిపై పోరాడటమే కాకుండా ప్రజల సమస్యలపై అలుపు ఎరగని పోరాటం చేస్తూ ..మరోవైపు విభజన హామీలపై ముఖ్యంగా ప్రత్యేక హోదా వద్దు ప్రత్యేక ఫ్యాకేజీ ముద్దని చెప్పిన చంద్రబాబు నోటి చేత ప్రత్యేక హోదానే కావాలి ..అందుకు ఎంతదాకా అయిన పోరాడతామని కేంద్రం మీద అవిశ్వాస తీర్మానం పెట్టేలా పోరాడిన వైసీపీ పార్టీ పట్ల ప్రజల్లో నెలకొన్న సానుకూలత ..ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకతతో వైసీపీ విజయానికి అడ్డు అదుపు లేకుండా పోయిందని ఈ సర్వేలో తేలినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. .దాదాపు 150 స్థానాలను గెలుచుకుంటారని తేలింది. ఇక జనసేనా, ఇతరులు కలిపి 5 స్థానాలు వస్తాయని తేలింది. ప్రస్తుతం ఈ సర్వేతో టీడీపీ నేతల్లో ఇప్పటికే భయం మొదలైయ్యిందని వైసీపీ నేతలు అంటున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat