కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డిని పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ మరోసారి దుమ్ముదులిపారు.రేవంత్ రెడ్డి ఒక జోకర్.. ఒక బ్రోకర్ అని ఎద్దేవా చేశారు. నిన్న పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్ర నిర్వహించింది.ఈ యాత్రలో భాగంగా బహిరంగ సభలో రేవంత్ చేసిన వాఖ్యలపై ఎర్రబెల్లి స్పందించారు. ఇవాళ వరంగల్ నగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..రేవంత్రెడ్డిని నేనే జైల్లో పెట్టించానంటున్నాడు. జైళ్లో నుంచి రాగానే నా ఇంటికి ఎందుకు వచ్చావు అని …అప్పుడే ఈ విషయం ఎందుకు చెప్పలేదని మీడియా వేదికగా అడిగారు.నేను నీలాగా పూటకో పార్టీ మారలేదు. పార్టీని టీఆర్ఎస్లో విలీనం చేశాను. నన్ను విమర్శించే నైతిక హక్కు రేవంత్ రెడ్డి కి లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో పాలకుర్తి నియోజకవర్గానికి వెళ్లడానికి మోకాలు లోతు బొందలుంటే.. ఇప్పుడు ఎటువంటి రోడ్లు ఉన్నాయో కనిపించడం లేదా అని ప్రశ్నించారు.టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్ని ప్రాజెక్టులను తెచ్చామో కనిపించడం లేదా. తండాలని గ్రామపంచాయతీలుగా మీరు ఎందుకు గుర్తించలేదన్నారు.
