ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనకై వైసీపీ ఎంపీలు చేపట్టిన ఆమరణ దీక్ష నేటికి మూడో రోజుకి చేరుకుంది.డిల్లీలో ని ఏపీ భవన్ లో నలుగురు వైసీపీ ఎంపీలు దీక్షను కొనసాగిస్తుండగా.. ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి అస్వస్థతకు లోను కావటంతో ఆయన్నినిన్న బలవంతంగా దగ్గరలోని ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ఆస్పత్రిలో కూడా ఆయన దీక్ష కొనసాగిస్తుండగా.. ఆరోగ్యం క్షీణించినట్లు వైద్యులు చెబుతున్నారు.అయితే వైసీపీ ఎంపీల ఆమరణ దీక్షకు మద్ధతు తెలిపేందుకు ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ నేడు ఢిల్లీకి వెళ్తున్నారు. దీక్ష కొనసాగిస్తున్న ఎంపీలతోపాటు….అస్వస్థతకు గురై ఆస్పత్రిలో ఉన్న ఎంపీ మేకపాటిని ఆమె పరామర్శించనున్నారని సమాచారం.
