ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని గత ఐదు రోజులనుండి వైసీపీ ఎంపీలు దేశ రాజధాని అయినటువంటి డిల్లీలో ఆమరణ దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో వారిని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ సాయంత్రం మంగళగిరిలో చేనేత కార్మికులతో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం స్కై ప్ ద్వార వీడియో కాల్ లో పరామర్శించారు.
see also :వైసీపీలోకి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ నేత..!!
” మీరు చేస్తున్న ఆమరణ దీక్ష ఐదు కోట్ల మంది ఆంధ్రులు జీవితకాలం మరిచిపోరు.రాష్ట్రం మొత్తం ఇప్పుడు మీ వైపె చూస్తుంది.మీరు మీ పదవులకు రాజీనామా చేసి ,ఆమరణ దీక్షకు దిగడాన్ని ప్రజలంతా హర్షిస్తున్నారని ” అన్నారు.
see also :ఉమ్మడి హైకోర్టు సంచలనాత్మక తీర్పు -ఇబ్బందుల్లో స్పీకర్ ..!
ఈ సందర్భంగా ఎంపీలు మాట్లాడుతూ..‘మాకు మా పదవులు.. ఆరోగ్యం కంటే ప్రజల తరపు పోరాటమే ముఖ్యం. మీరు ప్రజల కోసం ఎంత కష్టపడుతున్నారో మాకు తెలుసు. గతంలో మీరు చేసిన దీక్షలే మాకు స్ఫూర్తి. హోదా సాధించే వరకు పోరాడతాం’అని తెలిపారు. అనంతరం వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న జగన్ .. జాగ్రత్తగా ఉండాలంటూ వారికి సూచనలు చేశారు.