వైసీపీ అధినేత,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పపాదయాత్ర కృష్ణా జిల్లా విజయవాడకు చేరుకుంది . జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర నేటికి 136వ రోజుకు చేరుకుంది. ప్రస్తుత అధికార టీడీపీ పార్టీకి మంచి పట్టున్న కృష్ణా జిల్లాలోకి వైఎస్ జగన్ పాదయాత్ర ప్రవేశించింది.
see also :వైఎస్ జగన్పై మంత్రి అచ్చెన్నాయుడు పంచ్లు..!!
జగన్ కృష్ణా జిల్లాలోకి అడుగు పెట్టగానే..జగన్ కు జనం బ్రహ్మరధం పట్టారు.కనక దుర్గ వారధి వద్ద జనం పోటెత్తారు.ఈ క్రమంలో జగన్ పాదయాత్ర జిల్లాలోకి ప్రవేశించగానే టీడీపీ సీనియర్ నేత యలమంచలిరవి పార్టీలోచేరారు . జగన్ పాదయాత్ర కనకదుర్గమ్మ వారధికి చేరుకోగానే పెద్దయెత్తున తన అనుచరులతో వచ్చిన రవి జగన్ కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వైసీపీలోకి జగన్ కండువా కప్పి యలమంచలి రవికి స్వాగతం పలికారు.