రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత అధికార పార్టీ టీడీపీ ముఖ్యమంత్రి ,ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నేతృత్వంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీపై కేవలం ఐదు లక్షల (రెండు శాతం )ఓట్ల తేడాతోనే అధికార పీఠాన్ని సొంతం చేసుకున్న సంగతి తెల్సిందే.ఆ తర్వాత అధికారాన్ని అడ్డుపెట్టుకొని తెలుగు తమ్ముళ్ళు
నింగి నేల నిప్పు నీరు ఇలా పంచ భూతాలను ఏది వదలకుండా అన్నిటిని దోచుకుంటూ దాదాపు రెండున్నర లక్షల కోట్ల అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు అని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ చేస్తున్న ప్రధాన ఆరోపణ .
ఈ క్రమంలో గత నాలుగు ఏండ్లుగా వచ్చిన పలు సర్వేలలో ముఖ్యంగా సర్వేలను ఎక్కువగా నమ్మే చంద్రబాబు నాయుడు నిర్వహించిన పలు సర్వేలలో కూడా వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమనే తేలాయి .తాజాగా టీడీపీ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సోషల్ మీడియాలో ఎంతగా సపోర్టు ఉందో జగమెరిగిన సత్యం .అందుకు ఆయన తనయుడు మంత్రి నారా లోకేష్ నాయుడు మిత్రుడైన కిలారు రాజేష్ సోషల్ మీడియాను నడిపిస్తారు అని కూడా టాక్ .
ఇంతటి మహోత్తర బ్యాక్ గ్రౌండ్ ఉన్న చంద్రబాబుకు సపోర్టు చేసే ఒక పేజిలో నిర్వహించిన సర్వేలో ముఖ్యమంత్రి ఎవరు అని నిర్వహించిన సర్వేలో షాకింగ్ ఫలితాలు వచ్చాయి .నారా చంద్రబాబు నాయుడుకు మద్దతుగా ఉండే “చంద్రన్న జోలికి వస్తే తాట తీస్తా”అనే పేజిలో ముఖ్యమంత్రి ఎవరు ..దమ్మున్న నేత ఎవరు అని నిర్వహించిన సర్వేలో ఎవరికి ఎన్ని మార్కులు అంటే ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు కేవలం నలబై ఎనిమిది శాతం ఓటింగ్ వేయగా ..ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి యాబై రెండు శాతం మంది ఓటింగ్ వేశారు .వివరాలకు మీరు కూడా ఒక లుక్ వేయండి కింది స్క్రీన్ షాట్ లో ..