తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరోసారి సంచలనాత్మక ప్రకటన చేశారు.నిన్న బుధవారం రాష్ట్రంలోని మెదక్ జిల్లా నూతన కలెక్టరేట్ తదితర భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో
ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న నీటి తీరువాను రద్దు చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు .
ఇప్పటికే నేటి గురువారం నుండి రైతన్నలకు పెట్టుబడి కింద ఎకరానికి యాసంగి రబీ పంటలకు కల్పి ఎనిమిది వేల రూపాయలను ఇస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా తీసుకున్న నిర్ణయంతో రైతన్నలకు మరో తీపి కబురును అందించినట్లు అయింది .
ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న తాజా నిర్ణయంతో ఇప్పటివరకు ఉన్న మొత్తం ఎనిమిది వందల కోట్ల రూపాయల నీటి తీరువా బకాయిలు మాఫీ అయ్యాయి .ఇంకా ముఖ్యమంత్రి మాట్లాడుతూ భవిష్యత్తులో ఇంకా నీటి తీరువా పన్నులుండవు ..ప్రాజెక్టులు ,కాలువల నిర్వహణ బాధ్యత ప్రభుత్వమే చూసుకుంటుందని ఆయన ప్రకటించారు ..