అభినవ నేత్రి మహానటి సావిత్రి జీవిత నేపథ్యంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “మహానటి”. ఈ సినిమా నిన్న( బుధవారం మే 9వ తేదీ) ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రాన్ని చూసిన అనేక మంది సెలెబ్రిటీలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, చిత్ర యూనిట్పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.ఈ క్రమంలోనే రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఈ సినిమా పై ప్రశంసల జల్లు కురుపించారు.
What an incredible movie!! Truly blown away by #Mahanati@KeerthyOfficial just lived the role, Stunning performance ??
My Compliments to outstanding direction by Nag Ashwin, Swapna and terrific performances by @Samanthaprabhu2 @dulQuer @TheDeverakonda @chay_akkineni
— KTR (@KTRTRS) May 9, 2018
సినిమా అద్భుతంగా ఉందని ట్వీట్ చేశారు.సావిత్రి పాత్రలో కీర్తి సురేశ్ జీవించిందని ప్రశంసించారు. దర్శకుడు నాగ్ అశ్విన్, నిర్మాత స్వప్నలకు తన అభినందనలు తెలిపారు. సమంత, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, నాగచైతన్యల నటన అద్భుతంగా ఉందని కేటీఆర్ ట్వీట్ చేశారు.ఈ సినిమాలో సమంత, విజయ్ కీలకపాత్రలు పోషించారు.